రేపు కేంద్ర కేబినెట్ భేటీ.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష

by  |
Central Cabinet meeting tomorrow
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కెబినేట్ సమావేశం జరగనున్నది. పలువురు మంత్రుల పనితీరుపై ఈ సమావేశంలో సమీక్షించనున్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో కెబినేట్ సమావేశాన్ని బుధవారం వర్చువల్‌గా నిర్వహించనున్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై మంత్రులతో ప్రధాని విస్తృతంగా చర్చించనున్నారు. ప్రధానంగా రోడ్డు రవాణా, పౌర విమానాయాన శాఖ, టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై మంత్రులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా ఇటీవల మంత్రులతో ప్రధాని మోడీ వరుసగా భేటీ అవుతున్నారు. త్వరలోనే మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కొద్ది రోజులుగా వార్తలు గుప్పు మంటున్నాయి. వార్తల నేపథ్యంలో తాజాగా కెబినేట్ సమావేశం జరుగనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది



Next Story

Most Viewed