రాజకీయ విమర్శలు కాదు.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోండి

by  |
రాజకీయ విమర్శలు కాదు.. ప్రజల ఇబ్బందులు పట్టించుకోండి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో, రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదాలు గుర్తించకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ విమర్శలు కాదు.. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడాలని హితవు పలికారు. రెమిడెసివర్ ఇంజెక్షన్ అందించడంలో కేంద్రం విఫలమైందని జగ్గారెడ్డి అన్నారు. రెమిడెసివర్ లేక, ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed