విభజన అంశాలపై కేంద్రం కీలక ప్రకటన

by  |
central news
X

దిశ, ఏపీ బ్యూరో: విభజన చట్టంలోని చాలా అంశాలను అమలు చేశామని.. మరికొన్ని అమలు దశలో ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పార్లమెంట్‌లో సమాధానమిచ్చారు. విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు నిత్యానందరాయ్ పార్లమెంటులో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. మౌలిక వసతులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థల ఏర్పాటుకు పదేళ్ల సమయం ఉందని గుర్తు చేశారు. విభజన చట్టం అంశాల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు నిత్యానందరాయ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు.


Next Story