బిపిన్ రావత్ దంపతులకు వారి కుమార్తెలు, ప్రముఖుల నివాళులు..

by  |
బిపిన్ రావత్ దంపతులకు వారి కుమార్తెలు, ప్రముఖుల నివాళులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వీరి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి.

ప్రజల సందర్శనార్థం బిపిన్ రావత్‌, మధులిక రావత్‌ల భౌతిక దేహాలను​శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 3 కామరాజ్‌ మార్గ్‌లోని రావత్‌ నివాసం వద్ద ఉంచుతారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు సైనిక సిబ్బంది నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామరాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ కంటోన్మెంట్‌లో బిపిన్‌ రావత్‌ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా వీరికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రావత్ కుమార్తెలు కృతిక, తరణి నివాళులు అర్పించారు. తల్లిదండ్రుల భౌతికకాయాలపై పూల రేకులు జల్లి అంతిమ వీడ్కోలు పలికారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ఇద్దరి భౌతికకాయాలకు పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్​గవర్నర్ అనిల్ బైజల్ సహా పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు.



Next Story