నేటి నుంచి జాన్ పహాడ్ దర్గాలో ఉత్సవాలు

by  |
నేటి నుంచి జాన్ పహాడ్ దర్గాలో ఉత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజైన గురువారం దర్గాలోని హజ్రత్‌ సయ్యద్‌, మొహినుద్దీనా షా సమాధులతోపాటు వెలుపల ఉన్న సైనిక బృందాల సమాధులపై గంధం చల్లి, పూలు, దట్టీలతో అలంకరించారు. ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో జాన్ పహాడ్ సైదులు దర్గా ముస్తాబైంది. తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకునే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Next Story

Most Viewed