క్రిస్మస్‌ను ఆనందంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 

by  |
క్రిస్మస్‌ను ఆనందంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 
X

దిశ,అమరచింత: పేద, ధనిక తేడా లేకుండా క్రైస్తవులందరూ ఆనందంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పేద క్రైస్తవులకు ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా ఏర్పాటు చేసిన నూతన దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు కూడా సంతోషంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉచితంగా నూతన దుస్తులు అందిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.

అనంతరం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని ఆయా గ్రామాల లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంగమ్మ నాగభూషణం గౌడ్, తహశీల్దార్ సింధుజ, ఎంపీపీ చుక్క మాలతి, జడ్పీటీసీ మార్క సరోజ వెంకటయ్య, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సర్పంచ్‌లు సర్వా రెడ్డి, పావని వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమేష్ ముదిరాజ్, కౌన్సిలర్ రాజ్ కుమార్, కో ఆప్షన్ ఏ పీ రాజేందర్, రఫీ, నందిమల వెంకటేష్, గోపాల్ నాయక్, హోలీయ దాసరి పురుషోత్తం, మైకుల మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed