నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం.. ఎమ్మెల్యే జిఎంఆర్

by  |
GMR
X

దిశ, గుమ్మడిదల: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులు 2.50 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను, పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీ కెమెరాల నీఘాలో గ్రామాలు సురక్షితంగా ఉంటాయన్నారు. నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ, విజయ భాస్కర్ రెడ్డి, సీఐ లాలు నాయక్, ఎస్ఐ విజయ్ కృష్ణ, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ దయానంద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ హుస్సేన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Next Story