- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2020-21కు సంబంధించి అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. తరగతులు, పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులకు ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందోనని భావించిన కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేశాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, పంజాబ్, ఒరిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
చివరకు ప్రధాని మోడీ సలహా మేరకు CBSC బోర్డు కూడా 10,12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని CBSC ప్రకటించింది. పరీక్షలు నిర్వహించకుండా 10,12వ తరగతి ప్రైవేట్ విద్యార్థులకు ఫలితాలు ప్రకటించలేమని స్పష్టం చేసింది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రైవేట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు CBSC తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో CBSC ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.