ఇండ్ కంపెనీలో సోదాలపై సీబీఐ ప్రకటన

by  |
ఇండ్ కంపెనీలో సోదాలపై సీబీఐ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఎంపీ రఘురామకృష్ణరాజు ఇండ్-భారత్ కంపెనీపై గురువారం నుండి సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై సీబీఐ స్పందించింది. ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ లో సోదాలపై సీబీఐ ఓ ప్రకటన చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవరంపై కేసు నమోదైనట్లు తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసినట్టు పేర్కొంది. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ఇండ్-భారత్ కంపెనీపై కేసు. రూ.826.17 కోట్లు మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని తెలిపింది. నిధులు దారి మళ్లించి దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చినట్టు వెల్లడించింది.

కాగా ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా, హైదరాబాద్, ముంబై సహా 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. కంపెనీ ఆఫీసులు, యజమాని నివాసాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed