విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్

by  |
విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో తాజాగా విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ నెల 10వ తేదీన విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.



Next Story

Most Viewed