వనస్థలిపురంలో దొంగల హల్‌చల్..

by  |
వనస్థలిపురంలో దొంగల హల్‌చల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం చోరీకి గురైంది. గుర్తుతెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్ తో తెరిచి అందులోని నగదు మొత్తం అపహరించినట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు.దొంగతనానికి గురైన సొమ్ము విలువ రూ.6.5 లక్షలు ఉంటుందని అంచనా.

బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story