కరోనాపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు 

by  |
కరోనాపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు 
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపార కుటుంబంలో పలువురికి కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో సందేశం పంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందేశంతో బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురై తమకు ఫోన్‌ చేశారని, ఆ మెసేజ్ తమకు ఇబ్బంది కలిగిందని షాహుస్సేన్‌ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరపగా సరోడే శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఈ సందేశం పంపించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు.

Tags: False Propaganda, Coronavirus, Case Register, mahabubnagar,two town police

Next Story

Most Viewed