రాందేవ్ బాబాపై కేసు

by  |
రాందేవ్ బాబాపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: రాందేవ్ బాబాపై కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు పతంజలి సంస్థ సీఈవో బాలకృష్ణ, సైంటిస్ట్ అనురాగ్, డాక్టర్ బల్బీర్ సింగ్, అనురాగ్‌ తోమర్‌పై జైపూర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను తగ్గించే మందును కనిపెట్టామని, ఈ మందును వాడితే 14రోజుల్లో నయం అవుతుందని చెప్పి రిలీజ్ చేశారు. ఈనెల 23న దీన్ని ప్రకటించిన పతంజలి సంస్థపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు కేంద్ర ఆయుశ్ మంత్రిత్వశాఖ కూడా మందును తయారు చేయడానికి అనుకరించిన విధానం తెలపాలని కోరింది.

Next Story