TRS MLA: భూ వివాదంలో కోర్టు సీరియస్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

by  |
TRS MLA: భూ వివాదంలో కోర్టు సీరియస్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్ : భూ వివాదం కేసులో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సుభాష్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాప్రాలోని సర్వే నెంబర్. 152లో 90 ఎకరాల భూ వివాదంలో ఎమ్మె్ల్యేపై ఆరోపణలు వచ్చాయి. భూ వివాదంలో ఎమ్మెల్యే సుభాష్ డబ్బులు డిమాండ్ చేశారని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసులకు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ భూ వివాదంలో ఉప్పల్ ఎమ్మె్ల్యేతో పాటు కాప్రా MRO గౌతమ్ కుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 1206,166A, 167, 168, 170, 171, 447, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్టు పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed