నారా లోకేశ్ పై కేసు నమోదు

by  |
నారా లోకేశ్ పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ పై కేసు నమోదు అయింది. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాక్టర్ డ్రైవింగ్ పై అవగాహన లేకుండా డ్రైవింగ్ చేసినందుకు, దీనికి తోడు మరో పది మందిని ట్రాక్టర్లు ఎక్కించుకునీ వారి ప్రాణాలకు హాని కలిగే విధంగా నడిపినందుకు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. కొవిడ్ 19 నిబంధనలను పాటించకుండా కార్యక్రమాలను చేశారని ఆకివీడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


Next Story

Most Viewed