- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా : ‘కోయి మిల్ గయా’ సినిమా ద్వారా గుర్తింపు పొందిన యాక్టర్ రజత్ బేడీ ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు. సోమవారం వర్క్ ప్లేస్ నుంచి డీఎన్ నగర్లోని తన ఇంటికి వస్తున్న ఓ 39 ఏళ్ల వ్యక్తి ఈ యాక్సిడెంట్లో గాయపడ్డాడు. సదరు వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. అతన్ని రజత్ బేడీనే ముంబైలోని కూపర్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు బాధితుడి ఫ్యామిలీని సంప్రదించడంతో పాటు అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ యాక్సిడెంట్కు సంబంధించి రజత్పై ఐపీసీ, మోటార్ వెహికల్ యాక్ట్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెల్లడించారు. కాగా పేషెంట్ పరిస్థితిపై స్పందించిన డాక్టర్స్.. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో ఆక్సిజన్ సపోర్ట్తో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రమాదం గురించి బాధితుడు రాజేశ్ వైఫ్ బబితా దూత్ పలు విషయాలు తెలిపింది. ‘సా 6.30 గంటలకు నా భర్త పనికెళ్లి తిరిగొస్తుండగా.. MH 02 CD 4809 నంబరు గల కారులో వస్తున్న రజత్ బేడీ ఢీకొట్టాడు. ఆ సమయంలో రాజేష్ తాగివున్నాడు. అతను రోడ్డుదాటే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి’ అని చెప్పింది.