కూల్చివేస్తామన్న ఆ ఇద్దరిపై కేసులు

by  |
కూల్చివేస్తామన్న ఆ ఇద్దరిపై కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖుల సమాధులు, పవిత్ర కట్టడాలను కూల్చివేస్తామన్న నేతల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు సుమోటో కింద కేసు ఫైల్ చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ట్యాంక్‌బండ్ పై ఉన్న ఎన్టీఆర్ ఘాట్, పీవీ ఘాట్‌లను కూల్చివేస్తామని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ దారుస్సలాంను రెండు గంటల్లోనే కూల్చేస్తామన్నారు. ఇక ఇరువురి నేతల వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండ్రోజుల ఎన్నికల ప్రచార సమయంలో నాయకులను క్షుణ్ణంగా గమనిస్తామని చెప్పారు.



Next Story

Most Viewed