న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగింత

by  |
న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసు సీబీఐకి అప్పగింత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కోర్టులు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసును సోమవారం హైకోర్టు విచారించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ విచారణ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది.



Next Story

Most Viewed