తాడేపల్లి ఎస్సై బాలకృష్ణపై కేసు.. యువతి ధైర్యమే..!

by  |
tadepalli-police-station
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్సై బాలకృష్ణపై కేసు నమోదైంది. నిన్న సాయంత్రం ఆయన్ను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఓ యువతిని మోసం చేసిన కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ప్రేమ, పెళ్లి పేరుతో ఎస్సై బాలకృష్ణ మోసం చేయడంతో ఈనెల 23న పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఎస్సైపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు. దీంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed