- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామన్ రావు దంపతుల మర్డర్.. మంథని మున్సిపల్ చైర్పర్సన్పై కేసు
<p>దిశ, కరీంనగర్ సిటీ : మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడైన, బిట్టు శ్రీనుతో అనుమతి లేకుండా మాట్లాడటంతో, 80/2021, U/S 186 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో కోర్టు విచారణ నిమిత్తం గత నెల 19న మంథని కోర్టుకు తీసుకువచ్చిన బిట్టు శ్రీనుతో నిబంధనలకు […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ : మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుడైన, బిట్టు శ్రీనుతో అనుమతి లేకుండా మాట్లాడటంతో, 80/2021, U/S 186 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హత్య కేసులో కోర్టు విచారణ నిమిత్తం గత నెల 19న మంథని కోర్టుకు తీసుకువచ్చిన బిట్టు శ్రీనుతో నిబంధనలకు విరుద్ధంగా ఆమె కలిసి మాట్లాడినట్లు తేలింది. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదుతో కేసు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధించే అవకాశమున్నట్లు న్యాయవాదులు పేర్కొంటున్నారు.
Next Story






