4లక్షల మార్క్ దాటిన ఏపీ..

by  |
4లక్షల మార్క్ దాటిన ఏపీ..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల మార్క్‌ను దాటింది. దాంతో గడిచిన 24గంటల్లో 10,526 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మొత్తంగా 61, 331 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

తాజా కేసులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 4,03,616కు చేరుకుంది. గడిచిన 24గంటల్లో కరోనాతో 81 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో మొత్తం మృతుల సంఖ్య 3,714కు చేరుకుంది. చికిత్స అనంతరం కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 3,03,711కు చేరుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 96,191 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కేసుల వివరాలు :

నెల్లూరులో 1151,
ఈస్ట్‌ గోదావరిలో 1178,
గుంటూరులో 801,
అనంతపురంలో 833,
పశ్చిమ గోదావరిలో 986,
కృష్ణలో 414,
కర్నూలులో 757,
చిత్తూరులో 819,
కడపలో 501,
శ్రీకాకుంలో 764,
ప్రకాశంలో 874,
విజయనగరంలో 552,
విశాఖపట్నంలో 896 చొప్పున కేసులు నమోదయ్యాయి.



Next Story

Most Viewed