ఖ‌మ్మంలో కొత్త‌గా 296 క‌రోనా కేసులు

by  |
ఖ‌మ్మంలో కొత్త‌గా 296 క‌రోనా కేసులు
X

దిశప్ర‌తినిధి, ఖ‌మ్మం : తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ ఇంకా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో ఖ‌మ్మం జిల్లాలో శనివారం పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి పెరిగింది. ఆర్ ఏటీ ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డంతో జిల్లాలో కొత్త‌గా కేసుల సంఖ్య‌ల్లో వంద‌ల్లో న‌మోద‌వుతున్నాయి.

తాజాగా జిల్లాలో 1,291మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 296 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. మొత్తం ప‌రీక్ష‌ల్లో సంఖ్యలో పావు వంతు మందికి పాజిటివ్‌గా రావడం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. గ‌త రెండ్రోజులుగా ఇదే రీతిలో ఫ‌లితాలు వ‌స్తుండ‌టం గమనార్హం.

Next Story