చిత్తూరులోని స్కూల్లో కరోనా కలకలం

by  |
చిత్తూరులోని స్కూల్లో కరోనా కలకలం
X

దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా కరబలకోట మండలంలోని రిషివ్యాలీ ‌స్కూల్‌పై కరోనా పంజా విసిరింది. ఆ స్కూల్లో చదువుకుంటున్న 11 మంది విద్యార్థులకు కరోనా సోకింది. విద్యార్థులకు కరోనా సోకినట్టు గుర్తించిన స్థానిక ఏఎన్ఎం, వాలంటీర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో కరబలకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి అనూహ్య సిబ్బందితో విద్యార్థులను పరీక్షించారు. కరోనా సోకినప్పటికీ విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఎలాంటి భయం అవసరం లేదని త్వరలోనే కోలుకుంటారని డా. అనూహ్య స్పష్టం చేశారు.



Next Story

Most Viewed