- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహాబూబ్ నగర్: వాగు దాటుతున్న క్రమంలో నీటి ఉధృతికి కారు కొట్టుకుపోయి మహిళ గలంతైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల గ్రామ సమీపంలో వాగులో ప్రమాదవశాత్తు కారు వరద ఉధృతి నీటికి కొట్టుకుపోయింది. బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే క్రమంలో కలగొట్ల మీదుగా హైవేకు చేరుకునే క్రమంలో కలుగొట్ల గ్రామ సమీపంలోని వాగులో ప్రమాదం చోటుచేసుకుంది.
పులివెందులకు చెందిన ముగ్గురు శివ కుమార్ రెడ్డి, భార్య సింధూ రెడ్డి, స్నేహితుడు జిలాని భాష కారులో ప్రయాణం చేస్తున్నారు. కారు వాగు దాటే క్రమంలో కారు నీటిలో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకోగా మహిళ సింధూ రెడ్డి వాగులో గల్లంతయింది. గల్లంతైన మహిళ కోసం గ్రామస్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Next Story