- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఖమ్మం జిల్లాలో విజయవాడ-ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం తుమ్మలపల్లి సమీపంలో కారు శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులను ఏపీ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వ్యాపార నిమిత్తం వీరంతా విజయవాడ నుంచి ఒడిశాకు వెళుతున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story