కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. బైపాస్ రోడ్డుపై నుంచి బోల్తా పడిన కారు

by  |
car-over2
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణ శివారులోని బైపాస్ రోడ్డుపై నుంచి కారు బోల్తాపడి ముగ్గురు గాయపడ్డారు. బుధవారం బోధన్ నుండి హైదరాబాద్ కు వ్యాపార నిమిత్తం కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కామారెడ్డి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరలో బైపాస్ రోడ్డు బ్రిడ్జి నుండి ప్రమాదవశాత్తు కారు కింద పడిపోయింది. ఈ సంఘటనలో ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కాగా ఈ ప్రమాదంలో బోధన్ కు చెందిన డ్రైవర్ నయిమొద్దీన్, ఎస్ కే హైమద్, మహమ్మద్ అబ్బాంలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని అంబులెన్స్ సిబ్బంది అంజయ్య, రామశంకర్ లు తెలిపారు.


Next Story

Most Viewed