మగతపాలెంలో అదుపు తప్పి కారు బోల్తా

by  |
మగతపాలెంలో అదుపు తప్పి కారు బోల్తా
X

దిశ, వెబ్‎డెస్క్: విశాఖ జిల్లా పాడేరు మండలం మగతపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివాహ వేడుకకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



Next Story