బోర్‎వెల్ లారీ, కారు ఢీ.. ఆరుగురు మృతి

by  |
బోర్‎వెల్ లారీ, కారు ఢీ.. ఆరుగురు మృతి
X

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కాపూర్ గేటు వద్ద వద్ద బోర్‎వెల్‎ను ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. మృతులు హైదరాబాద్ తాడ్ బండ్ వాసులుగా గుర్తించారు. మృతులు ఆసిఫ్ ఖాన్ (50, మహేష్ షనియా (18), నజియా బేగం (45), నజియ భాను( 36), హర్ష (28) హర్ష భాను (6) గా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed