మునిగిన కారులో ఐదుగురు.. ఏమై ఉంటారు?

by  |
మునిగిన కారులో ఐదుగురు.. ఏమై ఉంటారు?
X

దిశ‌, పాలేరు: కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీపురం వద్ద ఆదివారం సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ప్ర‌మాదాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే కాలువ‌లోకి దూకి.. కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురిని సుర‌క్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాధితుల పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. తమని రక్షించిన స్థానికులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed