- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లాహోర్: ముంబయి ఉగ్రవాద దాడికి మాస్టర్ మైండ్, వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. లాహోర్లో జౌహర్ టౌన్లోని సయీద్ ఇంటి ఎదుటనున్న పోలీస్ పికెట్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఇందులో కనీసం ముగ్గురు మరణించారని, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
అయితే, టెర్రర్ ఫైనాన్సింగ్ లింకులతో కొన్ని కేసుల్లో హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పేలుడు పదార్థాలను కారులో అమర్చారని, ఆ కారు పోలీస్ పికెట్ వద్దకు వచ్చాక పేలిందని పంజాబ్ ఐజీపీ ఇనామ్ ఘనీ వివరించారు. ఘటనాస్థలిని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంటు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది.
Next Story