హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

by  |
హఫీజ్ సయీద్ ఇంటి వద్ద బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
X

లాహోర్: ముంబయి ఉగ్రవాద దాడికి మాస్టర్ మైండ్, వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద కారు బాంబు పేలుడు సంభవించింది. లాహోర్‌లో జౌహర్ టౌన్‌లోని సయీద్ ఇంటి ఎదుటనున్న పోలీస్ పికెట్ సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఇందులో కనీసం ముగ్గురు మరణించారని, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

అయితే, టెర్రర్ ఫైనాన్సింగ్ లింకులతో కొన్ని కేసుల్లో హఫీజ్ సయీద్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. పేలుడు పదార్థాలను కారులో అమర్చారని, ఆ కారు పోలీస్ పికెట్ వద్దకు వచ్చాక పేలిందని పంజాబ్ ఐజీపీ ఇనామ్ ఘనీ వివరించారు. ఘటనాస్థలిని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంటు అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది.

Next Story

Most Viewed