- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ఇసుకబావి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహానికి వ్యక్తితో సహా కారు మంగళవారం రాత్రి కొట్టుకుపోయింది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సృజన లక్ష్మీ హోమ్స్ కాలనికి చెందిన ఆనంద్ (35) వరద నీటిలో కారు కొట్టుకుపోతుండగా అతని బావకు ఫోన్లో సమాచారం అందించాడు.
దీంతో వెంటనే అమీన్ పూర్ పోలీసులకు ఆనంద్ బావ సమాచారం అందించాడు. రాత్రి నుండి పోలీసులు, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ సిబ్బంది గాలింపు చర్యలను చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఆనంద్ ఆచూకీ తెలియలేదు. కాగా ఆనంద్ తండ్రి చంద్రకాంత్ మాట్లాడుతూ… తన కుమారుడు ఆనంద్ ఆచూకీని రెస్య్కూ టీం లను ఉపయోగించి త్వరగా తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వరద ప్రవాహంలో ఆనంద్ కొట్టుకుపోయి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా ఆచూకి తెలియకపోవడంతో ఆందోళనగా ఉందన్నారు.
Next Story