షిప్ యార్డు దుర్ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

by  |
Chandrababu
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ‌ హిందూస్థాన్ షిప్ యార్డులో ఘోర దుర్ఘటన జరిగింది. భారీ క్రేన్ కూలి 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రమాదంలో 10 మంది చనిపోవడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ప్రమాద సమయంలో క్రేన్ వద్ద 30 మంది వరకు ఉన్నారని, వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Next Story