అభ్యర్థుల జాబితా విడుదల.. వారిద్దరి మధ్య హోరాహోరి పక్కా

by  |
అభ్యర్థుల జాబితా విడుదల.. వారిద్దరి మధ్య హోరాహోరి పక్కా
X

దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు అభ్యర్థులను సీఎం మమత ప్రకటించారు. కాగా ఉత్తర బంగాల్‌లోని 3 స్థానాల్లో మాత్రం అభ్యర్థులను టీఎంసీ ప్రకటించలేదు. 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు టీఎంసీ టికెట్లు ఇచ్చారు. నందిగ్రామ్ నుంచి తాను పోటీచేస్తున్నానని మమత ప్రకటించారు. ఆమెకు పోటీగా బీజేపీ నుంచి సువెందు అధికారి బరిలో దిగనున్నారు. దీంతో ఆ నియోజక వర్గంలో హోరాహోరి పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మమతకు కుడి భుజంగా ఉన్న సువెందు ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed