మేం కూడా రద్దు చేస్తున్నాం: తమిళనాడు

by  |

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తమిళనాడు ప్రభుత్వం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో పరీక్షలు నిర్వహిస్తే ప్రమాదమని భావించిన తమిళనాడు ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా భావించి పరీక్షలు లేకుండా పై తరగతులకు పంపనున్నట్లు సీఎం పళనిస్వామి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సోమవారం తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed