భారత్‌ హెచ్చరించినా కెనడా పీఎం వినలేదు..!

by  |
భారత్‌ హెచ్చరించినా కెనడా పీఎం వినలేదు..!
X

న్యూఢిల్లీ: రైతుల మద్దతుపై కెనడా పీఎం జస్టిన్ ట్రూడో వెనక్కి తగ్గలేదు. ప్రపంచంలో ఎక్కడ శాంతియుత నిరసనలు జరిగినా వాటికి కెనడా మద్దతునిస్తుందని, సమస్యలకు చర్చలే పరిష్కారమని నమ్ముతుందని అన్నారు. గురునానక్ జయంతి రోజున ట్రూడో మాట్లాడుతూ, ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులకు కెనడా మద్దతిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రూడో వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహించింది. కెనడా ప్రధాని వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య సంబంధాలను దిగజార్చేలా ఉన్నాయని హెచ్చరించింది. అయినప్పటికీ, కెనడా పీఎం తన వైఖరిని మార్చుకోలేదు.


Next Story

Most Viewed