తాజ్ దక్కన్ లో ఘనంగా కేక్ మిక్సింగ్..

by  |
తాజ్ దక్కన్ లో ఘనంగా కేక్ మిక్సింగ్..
X

దిశ ,బంజారాహిల్స్: ఆపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్ బంజారాహిల్స్ లోని తాజ్ దక్కన్ లాన్ లో మిక్స్ అండ్ మింగిల్ కేక్ మిక్సింగ్ సెర్మోని కోలాహలంగా నిర్వహించింది. నగరానికి చెందిన సోషలైట్లు, టాలీవుడ్ తారలు అషిమా నార్వాల్, దీపు నాయుడు, నటులు బాబు మోహన్, ప్రదీప్ మాచరాజు, కమల కామరాజు, దర్శకులు కరుణకుమార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆఫిల్ ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ నీలిమా ఆర్య మాట్లాడుతూ.. కరోనా కోరల్లోంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రపంచంలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, ఈ పాజిటివ్ దృక్పదంతో అందరిలో ఉత్తేజాన్ని నింపే గొప్ప వేదికగా 2022 మారాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

ఈ కార్యక్రమంలో ఒరిజిన్స్ ఫెర్టీలిటీ ఆసుపత్రి యం.డి డాక్టర్ రింకీ, మ్యాచ్ ఫాయింట్ బ్యాండ్మింటన్ అకాడమీ ఫౌండర్ వేణు ముప్పల, ఫౌండేషన్ అడ్వైజరీ డైరెక్టర్ కేశవరావు్, డైరెక్టర్ నవీన్ ఆర్య, డాక్టర్ రమేష్ డెర్మాటికా డాక్టర్ దివ్వ , శుభం కనెన్షన్ రవి చింతల, కింగ్ ఫిషర్ పాన్ మసాలా అభిషేక్, ప్లా ఏ ప్లాంట్ ఫౌండర్ అంజని , గణేష్, తదరిలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed