పోడు భూముల సమస్యపై కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు

by  |
PoduBhumulu
X

దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలకు కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ సబ్ కమిటీలో మంత్రి సత్యవతి రాథోడ్ చైర్మన్‌గా, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్ సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరు వెంటనే రాష్ట్రంలోని పోడుభూముల సమస్యలపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు.



Next Story

Most Viewed