కేంద్రం కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ కొనసాగింపు

by  |
Free-Ration
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఐదు నెలల పాటు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించనుంది. గరీభ్ కల్యాణ్​యోజన కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రతీ వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ దృష్ట్యా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పథకాన్నే మరో ఐదు నెలలు పొడిగించారు. అయితే రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు దారులు.. రాష్ట్ర ప్రభుత్వం అందించే బియ్యంతో పాటుగా కేంద్రం అందించే 5 కేజీల బియ్యాన్ని నవంబర్ వరకు ఉచితంగా పొందనున్నారు.



Next Story

Most Viewed