సీఏఏ మీట్‌‌కు ఏర్పాట్లు ముమ్మరం..

by Shyam |   (  Updated:2020-03-03 08:56:53  IST  )

<p>దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ ఈనెల 15న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు దానికి సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతుండటంతో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, హైదరాబాద్ సీపీ అంజని [&hellip;]</p>

సీఏఏ మీట్‌‌కు ఏర్పాట్లు ముమ్మరం..
X

దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో సీఏఏ(పౌరసత్వ సవరణ చట్టం)పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బీజేపీ ఈనెల 15న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇప్పటికే బీజేపీ శ్రేణులు దానికి సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరవుతుండటంతో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, హైదరాబాద్ సీపీ అంజని కుమార్‌తో కలిసి సభ ప్రాంగణం, ఏర్పాట్లను పరిశీలించారు.

Next Story