వోడాఫోన్ ఐడియాను వీడని ఆర్థిక కష్టాలు

by Disha Web Desk 17 |
వోడాఫోన్ ఐడియాను వీడని ఆర్థిక కష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మూడో టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియాను ఆర్థిక కష్టాలు ఇంకా వీడటం లేదు. కంపెనీ గురువారం తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌‌తో ముగిసిన కాలంలో నికర నష్టం గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.7595.5 కోట్ల నుంచి రూ.8737.9 కోట్లకు పెరిగిందని పేర్కొంది. సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో రూ.10,655.5 కోట్ల నుండి కార్యకలాపాల ద్వారా దాని ఏకీకృత ఆదాయం ప్రస్తుతం రూ.10,716.3 కోట్లకు చేరుకుంది. సబ్‌స్క్రైబర్స్ సంఖ్య మెరుగ్గా ఉండటం, 4G కస్టమర్ల జోడింపుల ద్వారా ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది. వోడాఫోన్ ఐడియా EBITDA రూ.4,097.5 కోట్ల నుండి రూ. 4,282.8 కోట్లకు పెరిగింది. వినియోగదారుల ఆర్పూ ఆదాయం మెరుగుపడి ఈ త్రైమాసికంలో రూ.142కి పెరిగింది, ఇది అంతకుముందు రూ.139గా ఉంది. సెప్టెంబర్ 30, 2023 నాటికి మొత్తం స్థూల రుణాలు రూ. 2,12,780 కోట్లుగా ఉన్నాయి.


Next Story

Most Viewed