రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-06 13:15:55  IST  )

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి
X

దిశ, చొప్పదండి : రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందిన సంఘ‌ట‌న మండ‌ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై న‌రేష్ రెడ్డి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రుక్మాపూర్ గ్రామానికి చెందిన తాటి కొండ కిర‌ణ్(24), చిలుక ప్ర‌దీప్ కుమార్ (24) TS08FF6269 నెంబ‌ర్ గ‌ల బైకు పై రుక్మాపూర్ నుంచి చాకుంట వైపు వెళ్తున్నారు. చాకుంట క్రాస్ రోడ్డు వ‌ద్ద రుక్మాపూర్ స‌మీపంలో క‌రీంన‌గ‌ర్ వైపు నుంచి ధ‌ర్మారం వైపు వెళ్తున్న TS15UA1818 నెంబర్ గల టిప్పర్ వాహనం ఢీ కొట్ట‌డంతో యువ‌కులు ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మృతుడు ప్ర‌దీప్ తండ్రి చిలుక రాజేశం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.టిప్ప‌ర్ డ్రైవ‌ర్ ధ‌ర్మారం మండ‌లం మ‌ల్లాపూర్ కి చెందిన సాయవేణి ప్ర‌వీణ్ అని ఎస్సై తెలిపారు.

Next Story