ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమాలు

by Disha Web Desk 17 |
ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం ప్రారంభమైన శిక్షణ కార్యక్రమాలు
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో జరుగనున్న ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం శిక్షణ కార్యక్రమాలు ఆదివారం జరిగాయి. దుర్గం చెరువు చుట్టూ 4.4 కిలోమీటర్ల ట్రాక్‌పై ఈ శిక్షణ జరిగింది. దాదాపు 500 మందికి పైగా రన్నర్లు ఈ శిక్షణ సదస్సులో పాల్గొన్నారు.

ఈ మారథాన్‌‌కు అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఆన్‌ ద స్పాట్‌ రిజిస్ట్రేషన్స్‌ సమయంలో ఇది కనిపించింది. శిక్షణ ప్రాంగణం వద్ద కూడా పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జనవరి 29, 2023న మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 జరగనుంది.


ఈ సంవత్సరం ఆరంభంలో రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ జరిగింది. దాదాపు 3వేలకు పైగా రిజిస్ట్రేషన్స్‌ అప్పుడు జరిగాయి. ఈ సంవత్సరం రన్నర్లు 5 కిలోమీటర్ల రన్‌, 10 కిలోమీటర్‌ రన్‌తో పాటుగా 21 కిలోమీటర్ల హాఫ్‌ మారథాన్‌లో కూడా పాల్గొనవచ్చు.

ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌‌ను నవంబర్‌ 30, 2022 వ తేదీ వరకు పొడిగించారు. టిక్కెట్ల ధరలను 5కె రన్‌‌‌కు 599 రూపాయలు,10కె రన్‌‌కు 1099 రూపాయలు, 21కె రన్‌ అయితే 1399 రూపాయలుగా నిర్ణయించారు.

రన్‌లో పాల్గొనేందుకు https://click2race.com/#/event/BJSth0pxo లింక్‌ను చూడండి.

Next Story