భారత మార్కెట్లో లైఫ్‌స్టైల్ ట్రక్ మోడల్‌ను ఆవిస్కరించిన టయోటా!

by Web Desk |
భారత మార్కెట్లో లైఫ్‌స్టైల్ ట్రక్ మోడల్‌ను ఆవిస్కరించిన టయోటా!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ తన మొట్టమొదటి లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ మోడల్ హైలక్స్‌ను గురువారం భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మల్టీ యూటిలిటీ విభాగంలో తీసుకొచ్చిన ఈ వాహనం అన్ని రకాల వినియోగానికి అనుగుణంగా ప్రవేశపెట్టింది. అడ్వెంచర్, లగ్జరీ సౌకర్యాలను అందిస్తున్న ఈ ఎంయూవీ టయోటా ఫార్చ్యూనర్ మాదిరిగా డిజైన్ చేసింది. అయితే, ఈ మోడల్‌కు సంబంధించిన ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మార్చిలో విడుదలయ్యే నాటికి పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపింది. అయితే, ఈ సరికొత్త పికప్ ట్రక్ మోడల్‌ను దక్కించుకునేందుకు వినియోగదారులకు ప్రీ-బుకింగ్ సదుపాయాలను గురువారం ప్రారంభించింది. దీనికోసం కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా అయితే రూ. 50,000, కంపెనీ డీలర్‌షిప్ వద్ద అయితే రూ. 1,00,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కారును ప్రస్తుతం బెంగళూరులోని కంపెనీ ప్లాంట్‌లో తయారు చేస్తున్నట్టు, బుకింగ్ అయిన వాహనాలను ఈ ఏడాది ఏప్రిల్‌లో డెలివరీలు మొదలుపెట్టనున్నట్టు కంపెనీ వివరించింది. సరికొత్త వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ కారులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్రైవర్ ఆరంరెస్ట్, డ్యుయెల్-జోన్ ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్ లాంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.



Next Story