పేటీఎం క్యూఆర్ కోడ్‌పై కంపెనీ సీఈఓ సంచలన ప్రకటన

by Dishanational1 |
పేటీఎం క్యూఆర్ కోడ్‌పై కంపెనీ సీఈఓ సంచలన ప్రకటన
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త సమస్య ఎదురైంది. ఆంక్షల వల్ల పేటీఎం క్యూఆర్ కోడ్ ఇంకా ఇతర కార్యకలాపాలు నిలిచిపోతాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎక్స్‌లో స్పందించారు. 'దేశీయంగా పేటీఎం క్యూఆర్ కోడ్‌తో పాటు సౌండ్ బాక్స్ పనిచేస్తూనే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ ఔట్‌లెట్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన స్కాన్-అండ్-పే ఎప్పటి లాగే పనిచేస్తూనే ఉంటుంది. ఈరోజు, రేపు, ఎప్పటికీ పేటీఎం చేయండి.. ' అని విజయ్ ట్వీట్ చేశారు. గత నెలాఖరున పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత కస్టమర్ అకౌంట్లు, వ్యాలెట్, ఫాస్టాగ్ డిపాజిట్లు ఏవీ తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దీన్ని మార్చి 15 వరకు పొడిగించారు. ఈ క్రమంలోనే పేటీఎం అన్ని రకాల సేవలు నిలిపోతాయని సోషల్ మీడియాలో కొన్ని నకిలీ కథనాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఆర్‌బీఐ సైతం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు సంస్థ అధినేత కూడా సందేహపడొద్దని, క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్‌లు పనిచేస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్ వరుసగా రెండో రోజు లాభపడింది. సోమవారం ట్రేడింగ్‌లో కంపెనీ షేర్ 5 శాతం పెరిగి రూ.358.35 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. యాక్సిస్‌ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న ప్రకటన తర్వాత కంపెనీ షేర్లలో సానుకూల ర్యాలీ కనిపించింది.


Next Story

Most Viewed