- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొమాటో బాటలోనే స్విగ్గీ.. ప్లాట్ ఫారమ్ ఫీజు పెంపు
గ్యాస్ కొరత నేపథ్యంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీలు ఫుడ్ ఆర్డర్లపై ప్లాట్ ఫారమ్ ఫీజును పెంచాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు షాక్ ఇస్తూ ప్రముఖ డెలివరీ సంస్థలు జొమాటో (Zomato), స్విగ్గీ (Swiggy) తమ ప్లాట్ఫారమ్ ఫీజును పెంచాయి. జొమాటో తన చార్జీలను సవరించిన కొద్ది రోజుల్లోనే స్విగ్గీ కూడా ప్లాట్ ఫారమ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రతి ఆర్డర్పై కస్టమర్లు చెల్లించే అదనపు భారం ఇప్పుడు మరింత పెరగనుంది.
కస్టమర్లపై అదనపు భారమే..
స్విగ్గీ తన ప్లాట్ఫారమ్ ఫీజును రూ.14.99 నుంచి ఏకంగా రూ.17.58 (జీఎస్టీతో కలిపి) కి పెంచింది. ఇది దాదాపు 17 శాతం పెరుగుదల కావడం గమనార్హం. ప్లాట్ఫారమ్ నిర్వహణ, మెరుగైన సేవలను అందించేందుకే ఈ ఫీజును సవరించినట్లు సంస్థ తన యాప్లో కస్టమర్లకు సమాచారం ఇస్తోంది. మరోవైపు జొమాటో కూడా ఒక్కో ఆర్డర్పై జీఎస్టీ కాకుండా రూ.12.50 గా ఉన్న ప్లాట్ఫారమ్ ఫీజును రూ.14.90 కి పెంచింది. అంటే ఒక్కో ఆర్డర్పై సుమారు రూ.2.40 అదనంగా భారం పడనుంది.
పన్నులతో కలిపి చూస్తే ఈ రెండు పోటీ సంస్థలు ఇప్పుడు దాదాపు ఒకే విధమైన చార్జీలను వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ప్లాట్ఫారమ్ ఫీజు అనేది చిన్న మొత్తంగా అనిపించినప్పటికీ, నెలకు పదుల సంఖ్యలో ఆర్డర్లు చేసే కస్టమర్ల బడ్జెట్పై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. యాప్ సాంకేతికతను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులు, కార్యకలాపాల వ్యయం పెరగడమే ఈ పెంపునకు కారణమని కంపెనీలు సమర్థించుకుంటున్నాయి.
అయితే.. ఈ ఫీజుల పెంపు సమయంలోనే ఫుడ్ డెలివరీ రంగంలోకి కొత్త పోటీదారులు ప్రవేశిస్తున్నారు. రైడ్-హేయింగ్ స్టార్టప్ రాపిడో ఇప్పటికే బెంగళూరులో 'ఓన్లీ' (Ownly) పేరుతో తన సేవలను ప్రారంభించింది. జొమాటో, స్విగ్గీలకు భిన్నంగా రాపిడో కస్టమర్ల నుంచి లేదా రెస్టారెంట్ల నుంచి అదనపు ప్లాట్ఫారమ్ ఫీజులు వసూలు చేయబోమని, కేవలం బేసిక్ డెలివరీ చార్జీలు మాత్రమే ఉంటాయని ప్రకటించడం విశేషం. కొత్తగా వస్తున్న ఈ సంస్థల ప్రభావం వల్ల భవిష్యత్తులో జొమాటో, స్విగ్గీలు తమ ధరల వ్యూహాలను మార్చుకుంటాయో లేదో వేచి చూడాలి.






