పైలట్ల జీతాల పెంపుతో పాటు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన స్పైస్‌జెట్!

by Disha Web Desk 13 |
పైలట్ల జీతాల పెంపుతో పాటు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన స్పైస్‌జెట్!
X

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తన పైలట్ల జీతాన్ని నెలకు రూ. 7.5 లక్షలకు పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ పైలట్ల వేతన పెంపును ఈ నెల 16 నుంచి వర్తిస్తుందని తెలిపింది. స్పైస్‌జెట్ సంస్థ చివరిసారిగా 2022, నవంబర్‌లో పైలట్ల జీతాలను సవరించింది. దాంతో కెప్టెంబర్ జీతం నెలకు రూ. 7 లక్షలకు పెరిగింది. మిగిలిన ఉద్యోగుల జీతాలు సైతం నిబంధనలకు అనుగుణంగా పెరిగాయి. తాజా పెంపు నిర్ణయంతో పాటు కెప్టెన్‌లకు నెలకు రూ. లక్షల నెలవారీ రాయల్టీ రివార్డ్‌ను కంపెనీ ప్రకటించింది. ఇది ఆయా ఉద్యోగుల నెలవారీ వేతనం కంటే ఎక్కువగా ఉంటుంది.

ఉద్యోగల్ జీతాల పెంపుతో పాటు స్పైస్‌జెట్ విమాన ప్రయాణీకులకు సైతం వార్షికోత్సవ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లను తక్కువ ధరలు అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అందులో భాగంగా బెంగళూరు-గోవా, ముంబై-గోవా మధ్య ప్రయాణానికి అతితక్కువ రూ. 1,818 ధరకే విమాన టికెట్ కొనవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఉంటుందని, టికెట్లను బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ ఏడాది జూలై 1 నుంచి 2024, మార్చి 30 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. అలాగే, వివిధ డిస్కౌంట్ కూపన్లను కూడా వినియోగదారులకు ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.


Next Story