ఎల్ఐసీ కొత్త ఛైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని సిఫార్సు చేసిన ఎఫ్ఎస్ఐబీ!

by Disha Web Desk 13 |
ఎల్ఐసీ కొత్త ఛైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని సిఫార్సు చేసిన ఎఫ్ఎస్ఐబీ!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీకి కొత్త ఛైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతీని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ మొహంతి ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతేకాకుండా మార్చి 14 నుంచి మూడు నెలల కాలానికి తాత్కాలిక ఛైర్‌మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎ

ల్ఐసీలో ఛైర్‌పర్సన్ పదవి కోసం గురువారం(మార్చి 23) రోజున నలుగురు ఎండీలను ఇంటర్వ్యూ చేసినట్టు ఎఫ్ఎస్ఐబీ ఓ ప్రకటనలో తెలిపింది. అందులో వారి పనితీరు, అనుభవం, ప్రస్తుత పరిమితుల ఆధారంగా ఎల్ఐసీ ఛైర్‌పర్సన్ పదవికి సిద్ధార్థ మొహంతిని సిఫార్సు చేసినట్టు పేర్కొంది.

Also Read...

అప్పు కట్టకుండా విదేశాల్లో ఆస్తులు కొన్న విజయ్ మాల్యా!


Next Story