వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆ కార్ల ధరలు పెంపు

by Yella Dhawani Reddy |

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది.

వాహనప్రియులకు షాకింగ్ న్యూస్.. ఆ కార్ల ధరలు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో (Bharat) తమ అన్ని రకాల వాహనాలపై 2 శాతం ధరలను (Car prices) పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు మే 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. నిర్వహణ వ్యయాలను సర్దుబాటు చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఆడి.. ఏ4, క్యూ5, క్యూ7, ఆర్‌ఎస్‌ ఇ-ట్రాన్‌ జీటీ వంటి ప్రముఖ మోడళ్లను విక్రయిస్తోంది.

కాగా, ఇప్పటికే ప్రముఖ కంపెనీలైన మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, కియా ఇండియా, హ్యుందాయ్‌, హోండా సంస్థలు పలు మోడళ్ల కార్ల ధరలను పెంచాయి. లగ్జరీ కార్లు తయారు చేసే బీఎండబ్ల్యూ మోటార్‌ ఇండియా సైతం అన్ని మోడళ్లపై 3 శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.

Next Story