- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Stock Market: భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్.. 800 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ప్రతికూలంగా పభావితమయ్యాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్గా చేసుకున్న పాకిస్తాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ పరిణామాలతో యుద్ధ పరిస్థితులు మరింత పెరగవచ్చనే భయాలు మదుపర్లలో కనిపించింది. ఫలితంగా దాదాపు అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. పాక్ దుందుడుకు చర్యలకు భారత్ గట్టి బదులిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితుల మధ్య న్యూఢిల్లీ, జమ్మూకశ్మీర్, పంజాబ్ అంతటా భద్రతా హెచ్చరికలు పెరిగాయి. ఇవే పెట్టుబడిదారుల ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 880.34 పాయింట్లు క్షీణించి 79,454 వద్ద, నిఫ్టీ 265.80 పాయింట్లు నష్టపోయి 24,008 వద్ద ముగిశాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితులు దిగజారడంతో దలాల్ స్ట్రీట్ భారీగా సంపదను కోల్పోయింది. మదుపర్ల ఒక్కరోజే రూ. 2.4 లక్షల కోట్లకు పడిపోయాయి. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల కీలక రియల్టీ, టూరిజం, ఏవియేషన్ వంటి రంగాల షేర్లలో ఎక్కువ అమ్మకాలు జరిగాయి. మరోవైపు, డిఫెన్స్తో పాటు డ్రోన్ తయారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు అంతేస్థాయిలో జరిగాయి. అమెరికా డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ 85.42 వద్ద ఉంది.
పాక్ మార్కెట్లకు దాదాపు రూ. 80 వేల కోట్ల నష్టం
తాజా పరిణామాలు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకోగల సత్తా ఉంది. అయితే, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే భారత్, పాక్ యుద్ధం వల్ల అక్కడి ఇన్వెస్టర్లు తమ స్టాక్ మార్కెట్ తీరుపై విశ్వాసం కోల్పోయార్. దీని కారణంగా గత మూడు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్(పీఎస్ఎక్స్) ఏకంగా రూ. 82,000 కోట్లను కోల్పోయింది. శుక్రవారం కూడా ఉదయం పీఎస్ఎక్ భారీ నష్టాల కారణంగా కొంతసేపు ట్రేడింగ్ ఆపేశారు. ఆ తర్వాత ప్రారంభవగానే స్వల్పంగా 0.77 శాతం లాభాలను చూశాయి.
- Tags
- Stock Market
- India
- Pakistan
- PSX
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation