జియో నుంచి సరికొత్త ప్లాన్స్.. రూ. 399కే ఫ్యామిలీ ప్లాన్

by Disha Web Desk 17 |
జియో నుంచి సరికొత్త ప్లాన్స్.. రూ. 399కే ఫ్యామిలీ ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా రెండింటిని వినియోగదారుల కోసం తెచ్చింది. అలాగే వ్యక్తిగత ప్లాన్లను కూడా అందిస్తుంది. మార్చి 22 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో అపరిమిత కాల్స్, మెసేజ్‌లు, OTT సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలు ఉన్నాయి.

పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌: జియో పోస్ట్ పెయిడ్ రూ. 399 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు,75 జీబీ డేటా లభిస్తుంది. దీనిలో ముగ్గురు మెంబర్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ప్లాన్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. మరో ప్లాన్ రూ. 699. దీనిలో100 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ కూడా లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్‌లో ముగ్గరు మెంబర్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌కు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 875 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకునే వినియోగదారులు ఒక్కో నంబర్‌పై అదనంగా రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది.

వ్యక్తిగత ప్లాన్లు: జియో నుంచి వచ్చిన రూ. 299 ప్లాన్‌లో ఉచిత కాల్స్, 30 జీబీ డేటా, మెసేజ్‌లు లభిస్తాయి. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 375 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ ప్లాన్‌లో ఎలాంటి ఫ్రీ ట్రయల్ ఉండదు. మరో ప్లాన్ రూ. 599. దీనిలో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, మెసేజ్‌లు లభిస్తాయి. సెక్యూరిటీ డిపాజిట్ రూ.750 గా ఉంది. ముఖ్యంగా జియో ఫైబర్ యూజర్లు, కార్పొరేట్ ఉద్యోగులు, మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు, క్రెడిట్ కార్డు వినియోగదారులకు సెక్యూరిటీ డిపాజిట్ నుంచి మినహాయింపు ఉంటుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 70000 70000 నంబరులో తెలుసుకోవచ్చు.



Next Story

Most Viewed